అమరావతి:
మంగళవారం ఏపీ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ రాష్ట్ర డిజిపి అధ్యక్షతన కలెక్టర్లు–ఎస్పీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి (ఐఏఎస్), జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ (ఐపీఎస్) పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజా సమస్యల పరిష్కారం, న్యాయసేవల వేగవంతత వంటి అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చ జరిగింది.

