రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ముఖ్యంగా అసైన్డ్ భూములు ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లపై ఉన్న “అసైన్డ్” గుర్తింపును తొలగించాలని సీఎం ఆదేశించగా, దానిని అమలు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జీవో నంబర్ 187ను మంగళవారం విడుదల చేశారు.
గతంలో ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో ప్రత్యేక గుర్తింపుగా “అసైన్డ్” అని ప్రస్తావించబడింది. దీంతో ఆ ప్లాట్లు కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా, సీఎం తక్షణమే సానుకూలంగా స్పందించారు.
దీని మేరకు ల్యాండ్ పూలింగ్ చట్టంలోని 9.24లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11(4) క్లాజ్లో సవరణ చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. ఇకపై రిటర్నబుల్ ప్లాట్లను “పట్టా భూమి”గా పరిగణించి రికార్డుల్లో నమోదు చేస్తారు.
🔸 దీతో అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులు కూడా తమ ప్లాట్లను అడ్డంకులు లేకుండా అమ్ముకునే వీలుంది.
🔸 ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

