మావోయిస్టు పార్టీ నుండి సంచలనాత్మక ప్రకటన వెలువడింది. పార్టీ ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ విడుదల చేస్తూ, సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరమణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ లేఖను ఆగస్టు 15న విడుదల చేసినట్లు సమాచారం.
లేఖలో మావోయిస్టులు, తమ వైపు నుండి ఆయుధాలను విరమించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణకు ముందుకు రావాలని సూచించారు. ఈ నిర్ణయం వెనుక పార్టీ అంతర్గత చర్చలే కారణమని భావిస్తున్నారు.
అయితే ఈ లేఖ నిజమైనదేనా అనే అంశంపై నిఘా విభాగాలు ఇప్పటికే పరిశీలన ప్రారంభించాయి. మావోయిస్టుల ఈ చర్య భవిష్యత్ రాజకీయ పరిణామాలపై కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
👉 ఈ పరిణామంపై కేంద్ర హోంశాఖ కూడా సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.

