ముంబై:ఈరోజు లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 17 కోసం యువత పోటీ పడుతున్నారు. ముంబైలోని BKC ఏరియాలో స్టోర్ బయట భారీ రద్దీ కనిపించింది. గంటల తరబడి క్యూలో నిలబడ్డ యువకులు ఒకరినొకరు తోసుకుంటూ చివరికి ఘర్షణకు దిగారు.
కొంతమంది తలపట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరడంతో అక్కడి సెక్యూరిటీ గార్డులు జోక్యం చేసుకుని వారిని నియంత్రించారు.అటు బెంగళూరులోనూ ఇదే పరిస్థితి. కొత్త ఐఫోన్ కోసం యువత ఎగబడి క్యూలలో నిలబడుతున్నారు.
ఒక్కో ఐఫోన్ 17 ధర రూ.1.5 లక్షల పైగా ఉన్నా, కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వస్తున్నారు.
భారతీయుల ‘ఐఫోన్ క్రేజ్’ మరోసారి స్పష్టమైంది.

