ఒంగోలు: చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తిపై ఒంగోలు మొబైల్ కోర్టు శుక్రవారం కఠినంగా వ్యవహరించింది. వివరాల్లోకి వెళ్తే, ఒంగోలుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి వెంకటేశ్వర్లు వద్ద రూ.2.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. బాకీ చెల్లింపుల కోసం ఇచ్చిన చెక్కు చెల్లని చెక్కుగా తేలింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.
విచారణ అనంతరం కోర్టు నిందితుడు సత్యనారాయణకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.3.10 లక్షల జరిమానా విధించింది. అందులో రూ.3 లక్షలు బాధితుడికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

