Tv424x7
Andhrapradesh

కీసరలో 50 కోట్ల భూమి కబ్జా ప్రయత్నం సంచలనం

మేడ్చల్ జిల్లా

కీసర పీఎస్ పరిధిలో భూమి కబ్జా వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రాంపల్లిలో 1999లో సర్వే నెంబర్ 385లో రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు ఇప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయి. కాంపౌండ్‌ వాల్‌, గది, ఎలక్ట్రిక్ మీటర్, LRS అన్నీ తన పేరుపై ఉండగానే భూమిని కబ్జా చేయాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ప్రణాళిక రచించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆయన సన్నిహితుడైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లి, లోకల్ వ్యక్తి సుబ్బారెడ్డిని రంగంలోకి దించారు. కీసర ఎమ్మార్వోకు ఫోన్ చేసి సహకరించాలని, రాచకొండ పోలీసులకు జోక్యం చేసుకోవద్దని సూచించినట్టు సమాచారం. అనంతరం సుబ్బారెడ్డి, తన అనుచరులతో కలిసి కాంపౌండ్ వాల్‌ను కూల్చి, ఇది సర్వే నెంబర్ 386 భూమి అంటూ వాదించారు.

అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నా భూమిని కబ్జా చేశారని ఆ ఎన్‌ఆర్‌ఐ మహిళ వాపోయారు. తన భూమి తిరిగి తనకే దక్కేలా న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు.

Related posts

అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితాలో అక్రమాలు- ఒకే ఇంటి నంబరుపై వందకు పైగా ఓట్లు!

TV4-24X7 News

నీలాపు సర్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన వాసుపల్లి

TV4-24X7 News

32వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టండి కార్పొరేటర్ కందుల నాగరాజు

TV4-24X7 News

Leave a Comment