సూర్యాపేట జిల్లా – రాయినిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం సంచలనం రేపింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కొబ్బరి బోండాల డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కానీ… ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో మానవత్వం మరచిన జనం వాహనానికి ఎగబడి, చెల్లాచెదురైన కొబ్బరి బోండాలను ఎత్తుకెళ్లడం అక్కడ ప్రత్యేక దృశ్యంగా మారింది.
డ్రైవర్ ప్రాణాపాయం తప్పించుకున్నప్పటికీ, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు సహాయం చేయాల్సిన జనాలు ఇలా వస్తువులపై దృష్టి పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.

