అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి చల్లారడం లేదు. వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
“మా తల్లిని నిండు సభలో అవమానించినప్పుడు మీకు గుర్తు రాలేదా? ఒక తల్లి పడే ఆవేదన, బాధ నాకు బాగా తెలుసు. మా తల్లిని అవమానించిన తర్వాత ఆమె కోలుకునేందుకు నెలలు పట్టింది.
అలాంటి వారు ఇవాళ మహిళల గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. వైసీపీ నేతలకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదు” అని మండిపడ్డారు లోకేష్.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

