సెంట్రల్ సెబు ప్రావిన్స్లో మంగళవారం రాత్రి 9:59 గంటలకు 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం బోగో నగరానికి 19 కిమీ ఈశాన్యంగా, కేవలం 5 కిమీ లోతులో గుర్తించబడింది.
ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా ప్రస్తుత సమాచారం ప్రకారం 19 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. బోగో, శాన్ రెమిగియో మరియు మెడెలిన్ మున్సిపాలిటీల ఆసుపత్రులు గాయపడ్డవారితో నిండిపోయాయి.
భూకంపం వలన వంతెనలు, గ్రామీణ రోడ్లు ధ్వంసం అయ్యాయి, విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. నేషనల్ గ్రిడ్ కార్పొరేషన్ వెంటనే మరమ్మతులు చేపట్టి, అర్ధరాత్రి తర్వాత విద్యుత్ పునరుద్ధరించింది.
నిపుణుల ప్రకారం, ఫిలిప్పీన్స్ “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఉన్నందున, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు తరచుగా జరుగుతాయి.

