Tv424x7
Crime News

కంచిలి దొంగతన కేసు ఛేదించిన పోలీసులు…

📍 సోంపేట, అక్టోబర్ 1:

కంచిలి గ్రామంలో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన A5 నిందితుడు పోలీసుల చెరలో చిక్కాడు. అతని వద్ద నుంచి 12 ¾ తులాల బంగారు ఆభరణాలు, 55 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ డి.లక్ష్మణరావు వెల్లడించారు.

కేసు నేపథ్యంకంచిలికి చెందిన రిటైర్డ్ ఒరియా లెక్చరర్ పుర్లి సింహాద్రి ప్రధానో (68) జూలై 5న తన భార్యతో కలిసి విశాఖపట్నం వెళ్లారు. తిరిగి జూలై 6 రాత్రి ఇంటికి చేరుకోగానే, ఇంటి తలుపులు పగలగొట్టి, బీరువా లాకర్‌లోని 25 తులాల బంగారం, 1 కేజీ వెండి వస్తువులు దొంగలించారని గమనించారు.

దర్యాప్తు & పట్టుబడిన విధానంఫిర్యాదు ఆధారంగా కంచిలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.84/2025 నమోదు అయింది. సోంపేట సిఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుండగా, అక్టోబర్ 1 ఉదయం కంచిలి రైల్వే స్టేషన్ వద్ద గస్తీ చేసిన పోలీసులు ఒక హిజ్రాను అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో అతడు తనతో పాటు బాబు, కబాడియా, సనాటా, టున్ని అనే నలుగురితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. అనంతరం తన ఇంటి వద్ద దాచిన ఆభరణాలను బయట పెట్టడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్నిందితుడిని అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Related posts

ప్రేమజంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

కొత్తగూడెంలో దారుణ హత్య….

TV4-24X7 News

అర్ధరాత్రి ఫోన్‌లో ‘బోల్డ్’ చాటింగ్‌లు.. కుటుంబాల్ని కుదిపేస్తున్న డిజిటల్ మోసాలు!

TV4-24X7 News

Leave a Comment