చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట సర్కిల్ వద్ద దుండగులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానిక దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో ప్రజలు, దళిత సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. “నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, కఠిన శిక్షలు విధించాలి” అని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గోవిందయ్య అక్కడికి చేరుకున్న నగరి డీఎస్పీ కాళ్లు పట్టుకుని మరీ విన్నవించారు. “మాకు న్యాయం చేయండి సార్, విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని శిక్షించండి” అని వేడుకున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

