Tv424x7
Telangana

శివమొగ్గలో విషాదం.. తల్లి-కుమార్తె మృతి

శివమొగ్గ జిల్లా గుండితిమ్మనహళ్లి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు, మానసిక ఆవేదన కారణంగా ఓ తల్లి తన 12 ఏళ్ల కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకుంది.

మృతులు శృతి(38), పూర్విక(12)గా గుర్తించారు. భర్త ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికొచ్చే సరికి ఇద్దరి మృతదేహాలు కనపడటంతో తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శృతి మానసిక సమస్యలతో బాధపడుతూ ఈ ఘోరానికి పాల్పడిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది

Related posts

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..

TV4-24X7 News

హైదరాబాద్‌లో మరో పెట్రోల్ బంక్ వివాదం

TV4-24X7 News

హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకువస్తా’ – సీఎం రేవంత్ రెడ్డి,

TV4-24X7 News

Leave a Comment