పులివెందుల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్సీపీకి గుడ్బై చెప్పి, తెలుగుదేశం పార్టీలో చేరాయి.
👉 లింగాల మండల టీడీపీ ఇన్చార్జ్ విశ్వనాథ రెడ్డి, దేవిరెడ్డి సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు ఘనంగా జరిగాయి.
పార్టీలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు.
🗣️ కొత్తగా చేరిన వారు మాట్లాడుతూ —
“ఎన్డీఏ కూటమి అభివృద్ధి దిశగా పనిచేస్తుంది. ప్రజల మేలు కోసం చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే భరోసా” అని తెలిపారు.
🚩 ఈ సందర్భంగా పులివెందుల నేత బీటెక్ రవి మాట్లాడుతూ —
“పులివెందులను ప్రగతి పథంలో పరుగులు పెట్టించడం మా లక్ష్యం. సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది” అని అన్నారు.

