వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు మేధోమధనం (Performance Audit) జరపాలని ఆదేశించారు. పౌరుల సంతృప్తి స్థాయి ప్రభుత్వానికి ముఖ్యమైన అంశమని సీఎం స్పష్టంచేశారు.
సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆర్టీజీఎస్, పౌర సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రధానంగా పరిగణిస్తూ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారధి, సీఏస్ కే. విజయానంద్, ఐటీ, ఆర్టీజీఎస్, సీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రజల నుండి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ ద్వారా అందుతున్న అభిప్రాయాలను విశ్లేషించి సమస్యల మూలాలను గుర్తించాలన్నారు. ఆర్టీజీఎస్ డేటా లేక్లో అపారమైన సమాచారాన్ని సక్రమంగా విశ్లేషించి, డేటా ఆధ.

