Tv424x7
Andhrapradesh

వేములవాడలో భక్తుల ఆగ్రహం..! బూజు పట్టిన లడ్డూల విక్రయం కలకలం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్ర లడ్డూ ప్రసాదం అమ్మకంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే— ఆలయంలో తయారైన లడ్డూలు పూర్తిగా ఆరకముందే విక్రయానికి పెట్టడంతో అవి బూజు పట్టి దుర్వాసన వెదజల్లుతున్నాయి.

లడ్డూలను తీసుకొచ్చే ట్రేల నుంచే దుర్వాసన రావడంతో భక్తులు ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యారు. పవిత్రంగా భావించే దేవాలయ ప్రసాదాన్ని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.

దేవస్థానం అధికారులు ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

నిరాశ్రయులను ఆదుకోవాలి కందుల నాగరాజు

TV4-24X7 News

పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌ కీలక సూచనలు

TV4-24X7 News

జీవీఎంసీ ప్రీమియర్ హై స్కూల్ ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment