ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్లపై తిరుగుతూ తిండి కోసం అల్లాడుతున్న ఆవుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. తినడానికి ఏమీ దొరకక చెత్త కుప్పల్లో తిరుగుతూ వాహనాల కిందపడే ప్రమాదానికి గురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వీటి కారణంగా ట్రాఫిక్ సమస్యలు, చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
స్థానికులు చెబుతూ — “ఈ ఆవులకు యజమానులు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. రాత్రింబగళ్లు వీధుల్లో తిరుగుతూ మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి” అని తెలిపారు.
ప్రజలు అధికారులు వెంటనే స్పందించి, ఈ ఆవులను పట్టణం నుంచి తరలించి గో రక్షణ కేంద్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

