మెంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి రాకపోకలు అంతరాయం ఏర్పడింది.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో వంటి విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి.
రద్దయిన సర్వీసుల్లో ఢిల్లీ, భువనేశ్వర్, హైదరాబాద్ నగరాలకు వెళ్లే విమానాలు ఉన్నాయి.
అయితే ఢిల్లీ–విజయవాడ ఇండిగో సర్వీస్ మాత్రం యథావిధిగా నడవనుంది.
తుపాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రయాణికులు విమానాశ్రయాలకు బయల్దేరే ముందు ఫ్లైట్ స్థితిని చెక్ చేయాలని సూచిస్తున్నారు.

