కెన్యా, :కెన్యాలో ఈ రోజు ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డయాని నుంచి కిచ్వా టెంబోకు బయలుదేరిన ఒక చిన్న విమానం కొద్దిసేపటికే క్వాలే కౌంటీ ప్రాంతంలో కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని శవాలను వెలికితీస్తున్నాయి. ప్రమాదానికి గల నిజమైన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

