దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం 1,009 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మహమ్మారి ప్రభావంతో ఇటీవల ఏడుగురు మరణించారని పేర్కొన్నారు. అత్యధికంగా కేరళలో 430, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83 కేసులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం.

previous post
next post