Tv424x7
Telangana

మహబూబాబాద్: జాతీయ రహదారి పై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గాయత్రి గుట్ట సమీపంలోని జాతీయ రహదారి పై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. కారులో అనిశ్చిత స్థితిలో ఉన్న శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కురవి మండలం తాట్యా తండాకు చెందిన రాంబాబు (28)గా గుర్తించారు.

ఇది హత్యా, ఆత్మహత్యా, లేక సహజ మరణమా (గుండె పోటా) అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై డీఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం విచారణ ప్రారంభించింది.

Related posts

ఒకటి కాదు, రెండు కాదు పది ప్రభుత్వ ఉద్యోగాలు

TV4-24X7 News

గచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు….రంగంలోకి మంత్రుల బృందం?

TV4-24X7 News

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ప్రియుడి

TV4-24X7 News

Leave a Comment