కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా పండగల కోసం గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు విడుదల చేయకపోవడంతో, స్థానికంగా పండగల ఖర్చులు తాము భరించలేక విరాళాలపై ఆధారపడుతున్నారు.
📌 గూడూరు మండలం ఏపూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను నిర్వహించేందుకు కార్యదర్శులు వాట్సప్ ద్వారా గ్రామస్తులను నేరుగా సహాయం చేయమని కోరారు.
📌 పెండింగ్లో ఉన్న బిల్లులు, నిధుల లభ్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
📌 ఇప్పటికే లంబాడీలు ఘనంగా జరుపుకునే తీజ్ పండగ కోసం తండాల్లో స్వంత డబ్బులు వెచ్చించాల్సి వచ్చిన పంచాయతీ కార్యదర్శులు, ఇప్పుడు వరుసగా వచ్చే రాష్ట్ర పండగలు మరింత భారమవుతున్నాయని చెబుతున్నారు.
🔸 నిధుల కొరత కారణంగా ప్రజల వద్దకు విరాళాలు అడగాల్సిన పరిస్థితి రావడం, ప్రభుత్వ వైఖరిపై గ్రామ కార్యదర్శుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

