అమరావతి:
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై పెద్ద చర్చలు కొనసాగుతున్నాయి. వైద్య రంగాన్ని ప్రైవేటీకరించడం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తే, అధికార పార్టీ ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.
ప్రధాన అంశాలు:గతంలో సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ మరియు NRI కోటాకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు మొత్తం కాలేజీని ప్రైవేట్ మోడల్కి తీసుకురావాలని ప్రయత్నం జరుగుతోంది.
కరోనా తర్వాత కేంద్రం ప్రతిపాదించిన పథకం ప్రకారం, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం కేంద్రం 60% ఖర్చు మద్దతు అందించగలదని సూచించింది.
ప్రైవేట్ మోడల్ వల్ల విద్య, వైద్యం వ్యాపార వస్తువుగా మారే ప్రమాదం ఉందని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) హెచ్చరిస్తోంది.
రాజ్యాంగ హక్కులు:విద్య (ఆర్టికల్ 21A, 29, 30, 45, 46) ప్రాథమిక హక్కుగా,ఆరోగ్యం (ఆర్టికల్ 21, 41, 42, 47) పరోక్ష హక్కుగా గుర్తింపు పొందింది.PAAP పేర్కొన్న సూచనలు:విద్య, వైద్యం వ్యాపారంగా మారకుండా పారదర్శకత అవసరం.
ప్రజల కోసం, ప్రజా సేవకుల చేతుల్లోనే ఆలోచన, ఆచరణ, ఫలితం ఉండాలి.

