హైదరాబాద్:
తెలంగాణ విద్యార్థి వంగపల్లి మణిసాయివర్మ జాతీయ సేవా పథకంలో (NSS) ప్రతిభ చూపించి రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్నారు.
హైదరాబాద్లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న మణిసాయివర్మ, తన సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకువచ్చినందుకు ప్రత్యేక గుర్తింపు పొందాడు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన ‘మై భారత్ – నేషనల్ సర్వీస్ స్కీం’ అవార్డును నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందజేశారు.
వారు పాల్గొన్న కార్యక్రమాలు యువతలో సేవా భావాన్ని పెంపొందించడంలో మోడల్గా నిలిచాయి

