వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈనెల 7న ఉ.10 గంటలకు దేశ ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్లు, సీఎంల నేతృత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్థులు ఇందులో పాల్గొనేలా చూడాలని సూచించింది..
previous post

