ఏపీ జలవనరులశాఖ సలహాదారు ఎన్.కన్నయ్య నాయుడికి కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని ప్రకటించారు. రేపు కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆగస్టు 10న వరదలతో కర్ణాటక లోని తుంగభద్ర జలాశయం19వ క్రస్టుగేట్కొట్టుకుపోయింది. ఈభారీ విపత్తు నుంచి జలాశయం లోని నీటిని పరిరక్షించే బాధ్యతను కన్నయ్య నాయుడి నేతృత్వం లోని ఇంజినీర్ల బృందం సమర్థంగా నిర్వహించింది. ఆ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను ఈపురస్కారానికి ఎంపిక చేసింది.

previous post
next post