Tv424x7
Andhrapradesh

ప్రభుత్వ నర్సులతోనే కేజీహెచ్ కు గౌరవం

వారి సమస్యలను పరిష్కరించేందుకు సిద్దం ప్రభుత్వ నర్సుల సంఘం సర్వసభ్య సమావేశంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివనంద్

విశాఖపట్నం ప్రభుత్వ నర్సుల సేవలకారణంగానే కేజీహెచ్ కు గౌరవం పెరుగుతోందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ అన్నారు. జిల్లా ప్రభుత్వ నర్సుల సంఘం ఎన్నికల తర్వాత మొదటి సర్వ సభ్య సమావేశం గురువారం ఆంధ్రా వైద్య కళాశాల సమావేశపు మందిరంలో జిల్లా అధ్యక్షురాలు గంగా భవానీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నర్సుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి సమస్య అయినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. గత ఆరేళ్లుగా గుర్తింపు నర్సింగ్ అసోసియేషన్ లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఇప్పుడు నూతన కార్యవర్గం అలాంటి సమస్యలన్నింటినీ అధిగమించగలదన్న నమ్మకం ఉందన్నారు. ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు మాట్లాడుతూ కేజీహెచ్ అంటేనే నర్సింగ్ సేవలు అందరికీ గుర్తుకొస్తాయని పేర్కొన్నారు. జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కె. ఈశ్వరరావు మాట్లాడుతూ నర్సుల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే జేఏసీలో చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని అందుకు తగ్గ ప్రణాళికలు వేస్తానన్నారు. ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగా భవానీ మాట్లాడుతూ తమ పానెల్ను విశ్వసించి భారీ మెజార్టీని కట్టబెట్టిన నర్సులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వ నర్సులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అలాగే కేజీహెచ్లోని స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవన పునర్నిర్మాణానికి పూర్వ విద్యార్థులుగా తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు సహకరిస్తామని హామీనిచ్చారు. మాజీ అధ్యక్షురాలు భూతం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ క్లిష్ట సమస్యలు తలెత్తినప్పుడు రిట్కెర్డ్ అయిన సీనియర్ నర్సుల సేవలను వినియోగించుకోవాలని అందుకు తాము సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా కార్యదర్శి జీవీఎస్ వరలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత జిల్లాలోని ప్రభుత్వ నర్సులను, అధికారులను, సభ్యులను సమీకరించి వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం బాధ్యతగా తమ సంఘం భావిస్తోందని, సమావేశానికి హాజరైన సభ్యులందరికీ అభినందనలు చెప్పారు. ఈ సమావేశంలో నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి రవి శంకర్, నగర అధ్యక్షుడు నారాయణరావు, ల్యాబ్ టెక్నీషియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. అప్పారావు, పీహెచ్సి, సీహెచ్సీ, ట్రైబల్ ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వ నర్సులు, కాంట్రాక్టు ఉద్యోగులు సంఘం నేతలు, నర్సింగ్ అసోసియేషన్ మాజీ ప్రతినిధులు, జిల్లా ప్రభుత్వ నర్సుల సంఘం ఉపాధ్యక్షురాలు ఇందిర, కోశాధికారి వంశీ, కార్యవర్గ సభ్యులు గౌరి, లిల్లీ గ్రేస్, పద్మజ, వినీల తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేడు ఏపీకి భారీ వర్ష సూచన

TV4-24X7 News

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

TV4-24X7 News

గుడివాడ అమర్నాధ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ద్రోణంరాజు శ్రీవత్సవ

TV4-24X7 News

Leave a Comment