హయత్ నగర్ భాగ్యలత కాలనీలో గంజాయి బానిసలు హడావుడి సృష్టించారు.వారిలో కొందరు స్పీడ్గా బైకులు నడుపుతూ, అరుపులు కేకలతో స్థానికులను భయపెట్టారు.
వెయ్యి రూపాయల కోసం తండ్రి–కొడుకులపై దాడికి దిగిన గంజాయి మూక పిడిగుద్దుల వర్షం కురిపించారు.
పెద్దగా అరుస్తూ కాలనీలో హంగామా చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటనతో కాలనీలో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసుల తక్షణ చర్య కోరుతున్నారు.

