హైదరాబాద్: ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించనందున నిరవధికంగా బంద్ ప్రకటిస్తున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో 10 లక్షల విద్యార్థులతో మహాధర్నా నిర్వహిస్తామని కళాశాల యాజమాన్య సంఘాల నేతలు తెలిపారు.
విద్యాసంస్థల ఆధ్వర్యంలో, దసరా వరకు రూ.1,200 కోట్ల బకాయిలను చెల్లిస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల వరకు ప్రభుత్వం అధికారులతో చర్చలు జరిపినప్పటికీ, చర్చలు విఫలమవడం వల్ల డిమాండ్లు నెరవేర్చే వరకు కళాశాలలు బంద్ కొనసాగిస్తాయని ఉన్నత విద్యాసంస్థల సంఘాల నాయకులు పేర్కొన్నారు.

