సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి, సంక్షేమం అమలు చేస్తామని చెప్పాం. అదే విధంగా సూపర్ సిక్స్ను సక్సెస్ చేశాం” అని సీఎం ప్రకటించారు.
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం – పెన్షన్లు. ఇప్పటివరకు 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందుతున్నాయి.
తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం.
మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకం, ఆర్థిక వ్యవస్థలో విశేష మార్పులు తెస్తుందని సీఎం పేర్కొన్నారు.
దీపం 2 పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు.
రైతుల కోసం అన్నదాత సుఖీభవ – మొదటి విడతలోనే రూ.7,000, మొత్తం మూడు విడతల్లో రూ.20,000 ఆర్థిక సహాయం.
ఆటో డ్రైవర్లకు రూ.15,000 చొప్పున అక్టోబర్ 1న అందించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

