అమరావతి:
సోలార్ పాలసీలో ఉన్న లోటుపాట్లపై శాసనసభలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ పాలసీలో సవరణలు అవసరమని స్పష్టంగా తెలిపారు.
ఈ సందర్భంగా వెంటనే స్పందించిన ప్రభుత్వం –
సమస్యలపై సమగ్ర సమీక్ష చేపడతామని
ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కార మార్గాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.
ప్రజల సమస్యలపై చురుగ్గా స్పందించడం ద్వారా ప్రభుత్వం ప్రజాపక్షమే అని మరోసారి నిరూపించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

