అమరావతి:
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు దసరా సెలవులు ముందుగానే ప్రకటించారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు విద్యాశాఖ అధికారులు, టీచర్ల సంఘాలతో చర్చలు జరిపి ఈనెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
“పండుగ సందర్భంలో ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ అనుకూలంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి అన్నారు
.ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.

