సూర్యాపేట :
జీతాలు ఇవ్వకపోవడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ గత 5 నెలలుగా జీతం రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మానసిక వేదనతో ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు
.ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో జీతాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది.

