ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఓ లాడ్జిలో శనివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.20,050 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.అరెస్టయిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
అలాగే, పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తూ, ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గమనిస్తే 100 నంబర్కు సమాచారం ఇవ్వవచ్చని సీఐ విజ్ఞప్తి చేశారు.

