పులివెందుల మాజీ సీఐ జె.శంకరయ్య నుంచి సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు వెళ్లాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్ఠ దెబ్బతీసారని ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని, రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
2019లో సస్పెండ్ అయ్యిన శంకరయ్య తర్వాత వీఆర్లో చేరారు. సీబీఐ విచారణలో విరుద్ధ వాంగ్మూలాలు ఇచ్చిన ఆయన, ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.

