అమరావతి, సెప్టెంబర్ 23:
నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా భ్రమానందరెడ్డి రాత్రి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. భేటీలో నంద్యాల నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనుల వేగవంతం, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చ జరిగింది.
అదనంగా, నంద్యాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలపై సమగ్రంగా చర్చలు జరిపినట్లు సమాచారం. భూమా భ్రమానందరెడ్డి గారు ప్రజల అభివృద్ధి తన ప్రధాన కర్తవ్యం అని, సీఎం గారు ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

