హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ ప్రవేశాల రెండో విడత గడువులు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి తాజా షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ మేరకు విద్యార్థులు తమ నమోదు, ఆప్షన్ ఎంట్రీలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ వంటి కార్యక్రమాలను సవరించిన తేదీల ప్రకారం పూర్తి చేసుకోవాలని సూచించింది.
🔹 అభ్యర్థుల రిజిస్ట్రేషన్ – అక్టోబర్ 3 వరకు
🔹 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ – అక్టోబర్ 4
🔹 వెబ్ ఆప్షన్ల నమోదు – అక్టోబర్ 6
🔹 ఆప్షన్లలో సవరణ – అక్టోబర్ 7
🔹 సీట్ల కేటాయింపు – అక్టోబర్ 10
🔹 కాలేజీల్లో రిపోర్టింగ్ – అక్టోబర్ 11
ఉన్నత విద్యామండలి తెలిపిన ప్రకారం, ఈ షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

