పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో దారుణం చోటుచేసుకుంది.గేదెకు వైద్యం చేయాలని చెప్పి మహిళా ఉద్యోగిని ఇంటికి పిలిపించుకున్న జాజుల తిరుపతయ్య అనే వ్యక్తి, అక్కడే ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.మహిళ కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెను రక్షించారు. అనంతరం బాధితురాలు యడ్లపాడు పోలీస్ స్టేషన్లో తిరుపతయ్యపై ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

