హైదరాబాద్:ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ మాజీ ఎండీ హరిరామ్పై ఉక్కుపాదం మోపుతోంది ప్రభుత్వం. ఆయనకు చెందిన అక్రమ ఆస్తుల జప్తుకు ఇరిగేషన్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలుసుకున్న వివరాల ప్రకారం —
మర్కూక్లో 28 ఎకరాల భూమి
బొమ్మలరామారం వద్ద 6 ఎకరాలు
పటాన్చెరులో 20 గుంటలు
షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు
మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగిలో రెండు ఇళ్లు, ఫ్లాట్లు
కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు
అమరావతిలో స్థలం
కొత్తగూడెంలో భవనంఈ మొత్తం ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయనుంది.ఇంత భారీ ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా.హరిరామ్ అవినీతి వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.

