Tv424x7
Nationalఆరోగ్యం

WHO షాకింగ్ హెచ్చరిక: భారత్‌కి చెందిన మూడు దగ్గు సిరప్లు ప్రమాదకరం!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా భారత్‌లోని మూడు ఫార్మా కంపెనీల దగ్గు సిరప్లను వాడొద్దని హెచ్చరిక జారీ చేసింది.

హానికరమైన సిరప్ల జాబితా:

శ్రేసన్ ఫార్మా – “కోల్డిఫ్” (Coldf) 

ఈ సిరప్‌ వల్ల ఇటీవల 22 మంది పిల్లల మరణాలు చోటుచేసుకున్నాయి.

రెడ్నేక్స్ ఫార్మా – “రెస్పిఫ్రెష్ TR” (Respifresh TR)

షేప్ ఫార్మా – “రీలైఫ్” (Relife)

WHO ప్రకారం, ఈ మందుల్లో డయిథిలిన్ గ్లైకాల్ (DEG) మరియు ఇథిలిన్ గ్లైకాల్ (EG) వంటి రసాయనాలు ఉండటంతో, అవి కిడ్నీ వైఫల్యం, మరణాలు వంటి తీవ్ర ప్రభావాలకు దారితీస్తాయని తేలింది.

అయితే, భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) తెలిపింది कि — ఈ మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని, దేశీయ మార్కెట్లో మాత్రమే విక్రయించబడ్డాయని స్పష్టం చేసింది.

WHO ప్రజలను, ముఖ్యంగా తల్లిదండ్రులను హెచ్చరిస్తూ — ఈ సిరప్లను వెంటనే ఉపయోగం ఆపాలని, పిల్లలకు ఇవి తప్పనిసరిగా ఇవ్వకూడదని సూచించింది.

ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఆరోగ్య శాఖ, డ్రగ్ కంట్రోల్ విభాగాలు చర్యలు ప్రారంభించాయి.

Related posts

చైనాపై టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం

TV4-24X7 News

రాజకీయాలు కాదు… సత్వర శిక్షలు కావాలి! : జస్టిస్. మదన్ బి లోకూర్

TV4-24X7 News

భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో ఏమి చేసాడో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment