రబీ సీజన్కు ముందు రైతులకు మరో ఎదురుదెబ్బ తగలబోతోంది. చైనా ఇటీవల యూరియా, డీఏపీ, ప్రత్యేక ఎరువుల ఎగుమతులను అక్టోబర్ 15 నుండి నిలిపివేయడంతో, భారతదేశంలో ఎరువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.భారతదేశం వినియోగించే యూరియా, డీఏపీ, టెక్నికల్ మోనోఅమోనియం ఫాస్ఫేట్ (TMAP), AdBlue వంటి ప్రత్యేక ఎరువుల్లో 95% వరకు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఎగుమతులు నిలిపివేయడంతో ధరలు 10–15% వరకు పెరగవచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.కరిగే ఎరువుల పరిశ్రమ సంఘం (SFIA) అధ్యక్షుడు రాజీబ్ చక్రవర్తి మాట్లాడుతూ, “చైనా ఎగుమతులు కనీసం మరో 5–6 నెలలు నిలిచే అవకాశముంది. దీని ప్రభావం భారతదేశం సహా ప్రపంచ మార్కెట్పై పడుతుంది” అని తెలిపారు.భారతదేశం ప్రతి సంవత్సరం 2.5 లక్షల టన్నుల ప్రత్యేక ఎరువులను వినియోగిస్తుంది. వాటిలో 60–65% రబీ సీజన్లోనే వాడబడతాయి. ప్రస్తుతం వ్యాపారులు కొంతవరకు నిల్వలు కలిగి ఉన్నా, ధరలు మాత్రం పెరగడం ఖాయం.దక్షిణాఫ్రికా, చిలీ, క్రొయేషియా వంటి దేశాల నుంచి కొంతమేర ప్రత్యామ్నాయ సరఫరా ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో అవసరాలను తీరించడం కష్టమని అధికారులు చెబుతున్నారు.
previous post

