Tv424x7
Andhrapradesh

తాడిపత్రిలో 144 సెక్షన్.. వేర్వేరు ప్రాంతాలకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి పెద్దారెడ్డి తరలింపు

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు..లాఠీఛార్జిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుడు కిరణ్‌కుమార్‌, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గతంలో వైకాపాకు అనుకూలంగా పనిచేసిన డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో ఈ లాఠీఛార్జి జరగడం గమనార్హం. ఎలాంటి గొడవలు జరగకుండా జేసీ ప్రభాకర్‌ రెడ్డి, పెద్దారెడ్డిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఇరు పార్టీల కార్యకర్తలు తాడిపత్రి పట్టణంలోకి రాకుండా పోలీసులు దారులన్నీ మూసివేశారు. 144 సెక్షన్‌ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ముహూర్తం ఫిక్స్, కండీషన్స్ అప్లై..!!

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలకు షాక్… ఎందుకో తెలుసా..

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్

TV4-24X7 News

Leave a Comment