హైదరాబాద్:
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ రాజకీయ ఆసక్తి పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్తున్నానని చెబుతూ గోవాకు వెళ్లిన ఆయనపై బీజేపీ నేతలు కొత్త ఆరోపణలు చేశారు.
భవిష్యత్తులో బీసీ సీఎం కుర్చీపై దృష్టి సారించిన మహేష్ కుమార్ గౌడ్ తెర వెనుక రహస్య మంత్రాంగం నడుపుతున్నారని విమర్శించారు.బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, పాల్వాయి హరీష్ రావు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
ప్రతిరోజూ మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో లక్డీకాపూల్లోని మహాలక్ష్మి అపార్టుమెంటుకు గన్మెన్ లేకుండా రహస్యంగా వెళ్తున్నారని ఆరోపించారు. అక్కడ ఎవరిని కలుస్తున్నారు? ఏం చర్చలు జరుగుతున్నాయి? అనే విషయాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఇక కాంగ్రెస్ లోపల కూడా మహేష్ కుమార్ గౌడ్ భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై చర్చలు.
అనూష

