సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
ఈ డిజిటల్ యుగంలో నిర్లక్ష్యంగా పంచుకునే ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్లకు లాభం చేకూరుస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకు సెలవుల్లో తీసిన ఫొటోలు, ఆఫీస్ బ్యాడ్జ్లు లేదా ఇతర వ్యక్తిగత డాక్యుమెంట్స్ను సోషల్ మీడియాలో పెట్టడం వలన ఫిషింగ్, ఐడెంటిటీ దొంగతనం, రాన్సమ్వేర్ దాడులు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి.
నిపుణుల సూచనలు:
సోషల్ మీడియాలో అన్నీ కాకుండా అవసరమైనవి మాత్రమే పంచుకోవాలి.
తరచూ ప్రైవసీ సెట్టింగ్స్ పరిశీలించాలి.
పబ్లిక్ స్టేజ్ మీద ప్రకటించలేనివి ఆన్లైన్లో పెట్టకూడదు.
సైబర్ సెక్యూరిటీ అవగాహనతోనే మొదలవుతుంది. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదం నుంచి రక్షిస్తుంది” అని అధికారులు సూచిస్తున్నారు.
అనూష

