సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
కారు టిప్పర్ లోపలికి ఇరుక్కుపోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది.
కారు డ్రైవర్ తల పూర్తిగా తెగిపడిపోయింది.
జెసిబి సహాయంతో మృతదేహాలను తీయడానికి ప్రయత్నించినా, నుజ్జునుజ్జు అయిన మృతదేహాలను తీయడం సాధ్యం కాలేదు.
దీంతో గడ్డపారలతో కారును పగలగొట్టి మృతదేహాలను వెలికితీశారు.

