హైదరాబాద్, సెప్టెంబర్ 23 (న్యూస్డెస్క్)
తెలంగాణ మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన “మహాలక్ష్మి పథకం” ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున, అంటే సంవత్సరానికి రూ.30,000 వరకు ఆర్థిక సాయం అందనుంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు ముందే ఈ పథకం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఈ పథకం ద్వారా లబ్ధిదారులు
కనీసం 18 ఏళ్లు నిండిన మహిళలు55 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు
ఇప్పటికే పింఛను పొందని వారుతెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు చెందిన మహిళలుప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో ప్రజాభిమానాన్ని పొందాలని చూస్తోందని సమాచారం.
అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది

