కడప జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లెలో బడి, గుడి పరిసరాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా మైదుకూరు ఎక్సైజ్ ఎస్.ఐ భారతి తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.అనుమానిత దుకాణాల్లో సోదాలు జరిపి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ భారతి మాట్లాడుతూ — “అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సంబంధితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
previous post
next post

