తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై ప్రయోగశాలలో నిర్వహించిన నీటి నమూనాల పరీక్షల్లో ఈ విషయాలు బయటపడ్డాయి.
ప్రాథమిక నివేదికల ప్రకారం, స్థానిక ప్రజల్లో ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న అనారోగ్య సమస్యలకు ఈ యురేనియం అవశేషాలే కారణమని నిపుణులు భావిస్తున్నారు. తురకపాలెం క్వారీ గుంటలలో నిల్వ ఉన్న నీటిలో అధికంగా యురేనియం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పరిణామంతో గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని భయాందోళన వ్యక్తమవుతోంది.
దీనిపై జిల్లా అధికారులు, కాలుష్య నియంత్రణ బోర్డు, భూగర్భ జలవిభాగం జట్టు పరిశీలన జరపనుందని సమాచారం.

