Tv424x7
Andhrapradesh

ఆంధ్రతీరం వైపు దూసుకువస్తున్న “మొంథా” తుఫాను..

ప్రభుత్వం, అధికారులు అత్యవసర చర్యలకు సిద్ధం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం “మొంథా” మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 790 కిమీ, కాకినాడకు 729 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తుఫాను మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందని సూచన.

తీరం దాటే సమయంలో గంటకు 110 నుండి 120 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక.

తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, పెనుగాలులు, సముద్రం అల్లకల్లోలం కానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసి, విపత్తు నిర్వహణ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది.

మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లవద్దని సూచన.

Related posts

పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ విడుదల..పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే..

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది

TV4-24X7 News

ఆగస్టు 15 సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి మహర్దశ

TV4-24X7 News

Leave a Comment